బ్రేకింగ్ న్యూస్
• మినిమం బ్యాలెన్స్‌పై రూ.19 వేల కోట్లు వసూలు • ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు..! • ఏపీలో సర్పంచ్ ఎన్నికలు • విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు • హిందూ ధర్మంపై దాడి జరిగితే ముక్త కంఠంతో ఖండించాలి

నాతవరం మండలంలో ఏడు రహదారులకు 8.12 కోట్లు విధులు మంజూరు..

Bureau February 07, 2026 07:07 PM 6 views
నాతవరం మండలంలో ఏడు రహదారులకు 8.12 కోట్లు విధులు మంజూరు..

నాతవరం దివ్యదర్శని: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు శనివారం స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ అభివృద్ధిపై మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా రహదారుల బలోపేతానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగా నర్సీపట్నం నియోజకవర్గానికి భారీగా నిధులు మంజూరయ్యాయని ఆయన వెల్లడించారు.
నర్సీపట్నం నియోజకవర్గంపై ప్రత్యేక అభిమానంతో ఒకే జీవో (G.O. 64) ద్వారా 29 రహదారుల కోసం రూ. 22 కోట్లు కేటాయించినందుకు మంత్రి పవన్ కళ్యాణ్ కు నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
నాతవరం మండలంలో 7 రహదారుల అభివృద్ధికి రూ. 8.12 కోట్లు కేటాయించినట్లు ఆయన వివరించారు.
ఈ పనులకు సంబంధించి మరో 15 రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని, రాబోయే వేసవి కాలం ముగిసేలోపు ఈ 29 రహదారుల పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని స్పీకర్ స్పష్టం చేశారు. రహదారి పనుల నిర్వహణలో ఎక్కడా అవకతవకలు జరగకూడదని, పనుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా స్థానిక నాయకులు, కార్యకర్తలు దగ్గరుండి పర్యవేక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. నాణ్యమైన రహదారుల ద్వారా గ్రామీణ రవాణా వ్యవస్థను మెరుగుపరచడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన తెలిపారు.

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

23 Mar 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```