సీఎం సహాయ నిధి రూ: 4,03,706/-చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి
భోగాపురం, దివ్య దర్శిని న్యూస్ :
నెల్లిమర్ల నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స నిమిత్తము ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన డబ్బును నిరుపేద కుటుంబాలకు చెందిన ఆరు మంది అర్హులైన లబ్ధిదారులకు అందజేసిన నెల్లిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే లోకం నాగ మాధవి. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 6 మంది బాధిత కుటుంబాలకు రూ.4,03,706/- విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. లబ్ధిదారుల వివరాలు
బుగత పైడయ్య గారి కుటుంబానికి – మోదవలస, దెంకాడ – 1,11,631/-
కనకల శ్రీను గారి కుటుంబానికి – మోదవలస, దెంకాడ – 45,786/-
కళ్ల కుమారి గారి కుటుంబానికి – పెద్దతాడివాడ, దెంకాడ – 71,922/-
గుండు ప్రశాంతి గారి కుటుంబానికి – భోగాపురం – 40,181/-
ఓనం రమణ గారి కుటుంబానికి – భోగాపురం – ₹84,186/-
బవిశెట్టి యోగేంద్ర గారి కుటుంబానికి – భోగాపురం – 50,000/-
ఈ సందర్భంగా ఎమ్మెల్యే లోకం నాగ మాధవి గారు మాట్లాడుతూ, అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఎంతో ఊరటనిస్తోందని తెలిపారు. అవసర సమయంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని, ప్రజల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయం అందేలా తనవంతు కృషి నిరంతరం కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేశారు.