బ్రేకింగ్ న్యూస్
• పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం - ప్రధాని సూచనలు పాటిద్దాం • రోలుగుంటలో విషాదం.. జ్వరంతో రెండేళ్ల బాలుడు మృతి నీలుబందలో పడగవిప్పిన విషజ్వరాలు: వైద్యం అందక మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమం • స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు  • పంచగ్రామాల ప్రజల ఆగ్రహం పేలబోతోంది • గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖ 

శవంపై కూర్చున్న ఎలుగుబంటి

Bureau February 12, 2026 11:56 AM 25 views
శవంపై కూర్చున్న ఎలుగుబంటి

శవంపై కూర్చున్న ఎలుగుబంటి… ఆదిలాబాద్ సరిహద్దులో భయానక ఘటన 

ముగ్గురు మృతి – ఆరుగురిపై దాడి, అటవీ శాఖ హెచ్చరికలు 

ఆదిలాబాద్ జిల్లా బోథ్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న మహారాష్ట్ర రాష్ట్రంలోని కైలాస్ టేకిడి ప్రాంతంలో ఎలుగుబంటి దాడి కలకలం రేపింది. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మొత్తం ఆరుగురిపై ఎలుగుబంటి దాడి చేసినట్లు సమాచారం.

స్థానికుల వివరాల ప్రకారం, ఉపాధి పనుల కోసం అటవీ ప్రాంతానికి వెళ్లిన వారిపై ఒక్కసారిగా ఎలుగుబంటి దాడి చేసింది. దాడి తీవ్రతకు ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించబడ్డారు. చనిపోయిన వ్యక్తి శవంపై ఎలుగుబంటి కూర్చున్న దృశ్యాలు అక్కడున్న వారిని భయభ్రాంతులకు గురిచేశాయి.

సమాచారం అందుకున్న అటవీ అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. జేసీబీ సహాయంతో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారికి సమీప ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

24 Jul 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```