అమరావతి: చట్టసభల పనితీరు, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన కోసం మంగళవారం 510 మంది విద్యార్థులు ఏపీ శాసనసభను సందర్శించారు. పది రోజులుగా సాగుతున్న ఈ విజ్ఞాన యాత్రలో ఇప్పటివరకు 93 పాఠశాలల నుండి 3,311 మంది విద్యార్థులు అసెంబ్లీని వీక్షించారు. సభా విరామ సమయంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు విద్యార్థులతో ముచ్చటించి వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీని సందర్శించిన విద్యార్థులకు త్వరలో పోలవరం ప్రాజెక్టు చూసే అవకాశం కల్పిస్తామన్నారు. యువత కేవలం ఉద్యోగాలతో కుటుంబానికే పరిమితం కాకుండా, ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.