వాహన శ్రేణికి బ్రేక్.. ఈవీలో గంటా
విశాఖపట్నం, మే 15: ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పిలుపు మేరకు నా దేశం - నా బాధ్యత విధానం అమలులో ప్రజా ప్రతినిధులు ముందుంటున్నారు. అందులో భాగంగానే భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన వాహన శ్రేణికి బ్రేక్ ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకునే క్రమంలో ఈవీ వాహన వాడకానికి శుక్రవారం శ్రీకారం చుట్టారు. అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో పొదుపు చర్యలు అవశ్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దేశ భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని ప్రజలందరూ పొదుపు బాట పట్టాలన్నారు.