యలమంచిలి, డీడీ న్యూస్ :
ఏళ్ళకాలంగా తమ సాగులో ఉన్న భూముల జోలికి అధికారులు రావద్దు అంటూ మండలంలోని పంచదార్ల గ్రామానికి చెందిన దళిత రైతులు శనివారం కూడా తమ భూములు వద్ద నిరశన కార్యక్రమాన్ని నిర్వహించారు. దళిత రైతులు చేస్తున్న నిరశన కార్యక్రమానికి సిపిఎం మండల నాయకులు జి. దేముడునాయుడు, చందక రామృకృ స్థలు తమ మద్దతిని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 48 సంవత్సరాలుగా రైతుల సాగులో ఉన్న మని మా జీవనాధారమైన భూములను అన్యాయంగా తీసుకోవడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తుండం అన్యామన్నారు. ప్రజా ప్రయోజనాలు కోసం ప్రభుత్వానికి భూమి అవసరమైతే 2013 భూసేకరణ చట్టప్రకారం సాగులో ఉన్న భూముల రైతులకు నష్ట పరిహారం చెల్లించి భూములను తీసుకోవాలని, భయపెట్టి, భయాభ్రాంతులకు గురించి రైతుల భూములను తీసుకోవడానికి ప్రయత్నాలు చేయడం అధికారులకు తగదని ఆరోపించారు. రైతులకు అన్ని విధాల న్యాయం చేసిన తరువాతే రైతుల భూములు జోలికి రావాలని లేకుండా దళిత రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సిపిఎం నాయకులు దేముడునాయుడు, రామకృష్ణలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత రైతులు పాల్గొన్నారు.