మహిళల ఉజ్వల భవితకు 'కిశోరి వికాసం'
దేవరాపల్లి దివ్యదర్శిని న్యూస్...
యుక్త వయసు బాలికలు, మహిళల ఉజ్వల
భవితకు కిశోర వికాసం కార్యక్రమం ఉపయుక్తమని ఐసిడిఎస్ సిడిపిఓ పి. లలిత కుమారి పేర్కొన్నారు. మండలంలోని దేవరాపల్లి, కలిగొట్ల, చిననందిపల్లి, వేచలం గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో అంగన్వాడీ సూపర్వైజర్లు కళ్యాణి, రాములమ్మ, ఆదిలక్ష్మిలు మాట్లాడుతూ.. బాలికల ఆరోగ్యం, పోషణ, రక్షణ, వ్యక్తిగత వికాసం సాధికారత లక్ష్యమన్నారు. ఋతుక్రమ ఆరోగ్యం (ఎంహెచ్ఎం), వ్యక్తిగత పరిశుభ్రత, గుడ్ టచ్/బ్యాడ్ టచ్, సైబర్ నేరాలు, బాల్య వివాహాల నివారణ (1098), యోగా వంటి అంశాలపై 11 రోజుల శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ అంశాలపై వారికి అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా బాలికలు తమ హక్కులను తెలుసుకోవడంతో పాటు, ఆత్మరక్షణ (సెల్ఫ్ డిఫెన్స్) లో కూడా శిక్షణ అవసరమన్నారు. ఈ కార్యక్రమాలలో అంగన్వాడి బోధకరాళ్లు జయలక్ష్మి, రమణమ్మ, నాగమణి, ఎర్నమ్మ, హైమావతి, వైద్య సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమాలను పాల్గొన్నారు.
మహిళల ఉజ్వల భవితకు 'కిశోరి వికాసం'
Bureau
May 16, 2026 07:14 AM
0 views
Related News
పది రోజులు గడవకముందే ఈ రోడ్డుపై గోతులు
Jan 27
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
Jan 29
ఎస్ బి పట్నంలో 10 లక్షల నిధులతో సిసి రోడ్లకు శంకుస్థాపన
Jan 29
ఎం బి పట్నంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ
Jan 29
మహిళల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం : మాడుగుల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యన్నారాయణమూర్తి
Feb 05
Ad Slot (300x250)
రాశి ఫలాలు (Horoscope)
08 Jun 2026Classifieds
View All
LOCAL N