ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల సిబ్బంది నిరసన
సీతానగరం:- జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసనలో భాగంగా మండలంలో రఘదేవపురం గ్రామంలో డిస్టిక్ కోపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎదురుగా మండలంలో ఉన్న 11 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో పనిచేయుచున్న సిబ్బంది నిరసనకుదిగారు. ఈ సందర్భంగా నిరసన కారులు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి 2019 సంవత్సరం తరువాత నియామకాలు పొందిన వారిని పర్మినెంట్ చేయాలని కోరుతున్నామని అన్నారు. అలాగే ప్రస్తుతం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో విధులు నిర్వహిస్తున్న వారికి 62 సంవత్సరాల వరకు వయోపరిమితి పెంచాలని కోరుతున్నామని అలాగే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల 36 జీవో ప్రకారం ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వారికి జీతాలు పెంచాలని,స్టేట్ గవర్నమెంట్ పే స్కేల్ ను అందించాలని,ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వం అందించే పే స్కేల్ ను 5 లక్షల వరకు పెంచాలని కోరుతున్నామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఉద్యోగులు పాల్గొన్నారు.