బ్రేకింగ్ న్యూస్
• పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం - ప్రధాని సూచనలు పాటిద్దాం • రోలుగుంటలో విషాదం.. జ్వరంతో రెండేళ్ల బాలుడు మృతి నీలుబందలో పడగవిప్పిన విషజ్వరాలు: వైద్యం అందక మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమం • స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు  • పంచగ్రామాల ప్రజల ఆగ్రహం పేలబోతోంది • గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖ 

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచిన నయారా ఎనర్జీ

Bureau March 26, 2026 08:45 AM 9 views
పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచిన నయారా ఎనర్జీ

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచిన నయారా ఎనర్జీ

లీటరు పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3

 దిల్లీ: నయారా ఎనర్జీ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచేసింది. లీటరు పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 చొప్పున పెంచింది. పెరిగిన ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. ఆయా రాష్ట్రాలు విధించే వ్యాట్‌ ఆధారంగా ఈ పెంపు వర్తిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో ఈ పెంపు గరిష్ఠంగా రూ.5.30 వరకు ఉంటుంది. దేశవ్యాప్తంగా లక్షకు పైగా పెట్రోల్‌ పంపులు ఉండగా.. రష్యా చమురు సంస్థ అయిన రాస్‌నెఫ్ట్‌కు చెందిన నయారా ఎనర్జీ 6,967 పెట్రోల్‌ పంపులను ఆపరేట్‌ చేస్తోంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు పెరిగిన నేపథ్యంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను సవరించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

మరో ప్రముఖ ప్రైవేటురంగ చమురు సంస్థ రిలయన్స్‌-బీపీ మాత్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పూ చేయలేదు. దేశవ్యాప్తంగా 2,185 ఔట్‌లెట్లను జియో-బీపీ నిర్వహిస్తోంది. సుమారు 90 శాతం మార్కెట్‌ వాటా కలిగిన ప్రభుత్వరంగ చమురు కంపెనీలైన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌  మాత్రం సాధారణ పెట్రోల్‌, డీజల్‌ ధరల్లో ఎలాంటి మార్పూ చేయలేదు. ప్రీమియం పెట్రోల్‌ ధరను మాత్రం రూ.2.30 మేరకు ఇటీవల సవరించాయి. ఇండస్ట్రియల్‌ డీజిల్‌ను లీటరుకు రూ.22 చొప్పున పెంచాయి.

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

08 Jun 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```