కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరి ప్రాణాన్ని విలువైనదిగా భావిస్తుందని,ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ సాయంతో రాష్ట్రవ్యాప్తంగా ట్రామా సెంటర్లను ఏర్పాటు చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అసెంబ్లీలో ప్రకటించారు. ఆసుపత్రుల ఉన్నతీకరణపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ... ఆళ్లగడ్డ,వాయల్పాడు,కొవ్వూరు, కోవూరు ఆసుపత్రుల బెడ్ల సామర్థ్యాన్ని 50 నుండి 100కు పెంచాలన్న ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
కేంద్ర సాయంతో ' ట్రామా సెంటర్ల ' ఏర్పాటు
Bureau
February 21, 2026 05:06 AM
3 views
LOCAL N