విశాఖపట్నం, జనవరి 26 ః గణతంత్ర దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం కలెక్టరేట్ వద్ద సోమవారం ఉదయం జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గౌరవ వందనం స్వీకరించారు. అధికారులకు, సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గణతంత్ర దినోత్సవ విశిష్టతను, ప్రధాన్యతను వివరించారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలోని పార్కు వద్ద ఉన్న గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సత్తిబాబు, ఇతర అధికారులు గౌరవ వందనం సమర్పించి, గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేశారు. కలెక్టరేట్ ఏవో, సెక్షన్ల సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.