బ్రేకింగ్ న్యూస్
• మినిమం బ్యాలెన్స్‌పై రూ.19 వేల కోట్లు వసూలు • ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు..! • ఏపీలో సర్పంచ్ ఎన్నికలు • విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు • హిందూ ధర్మంపై దాడి జరిగితే ముక్త కంఠంతో ఖండించాలి

40 లక్షల రూపాయలు విలువచేసే గంజాయి పట్టి వేత

Bureau February 05, 2026 06:32 PM 10 views
40 లక్షల రూపాయలు విలువచేసే గంజాయి పట్టి వేత

అనకాపల్లిజిల్లా నర్సీపట్నం,  దివ్య దర్శిని న్యూస్ 

40 లక్షల రూపాయలు విలువచేసే గంజాయి పట్టి వేత

ఒక మహిళతో సహా 7 మంది ముద్దాయిలు అరెస్టు

ఒక కారు , మూడు ద్విచక్ర వాహనాలు , ఏడు సెల్ ఫోన్లు స్వాధీనం


40 లక్షల రూపాయలు విలువచేసే గంజాయితో పాటు ఒక కారు, మూడు ద్విచక్ర వాహనాలను పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. నర్సీపట్నం డిఎస్పి పి శ్రీనివాసరావు , నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్ రేవత్తమ్మ రూరల్ పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో డిఎస్పి శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా ఎస్పి తుహిన్ సిన్హా సమాచారం మేరకు నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ ఆదేశాల మేరకు కృష్ణ దేవి  పేట వద్ద ఎస్ఐ రిషికేష్, నర్సీపట్నం రూరల్ ఎస్ఐ పి రాజారావు , గొలుగొండ ఎస్ఐ రామారావు తమ సిబ్బందితో కృష్ణదేవిపేట వద్ద వాహనాలు తనిఖీ నిర్వహించగా అనుమానాస్పదంగా
ఉన్న WB96E 6809 వాహనం తనిఖీ చెయ్యడం జరిగిందన్నారు.కారులో 20 కేజీల చొప్పున రెండు బస్తాల్లో అక్రమంగా తరలిస్తున్న 40 కేజీల గంజాయితో పాటు గంజాయిని తరలిస్తున్న ఏడుగురు నిందితులను అదుపులో తీసుకోగా అందులో ఒక మహిళ కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. వారిని విచారణ చేయగా ఒడిశా రాష్ట్రం నుండి తమిళనాడు తరలిస్తున్నట్లు తెలియజేశారు. సదురు ముద్దాయిలపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు తెలియజేశారు. అనంతరం ఎంతో చాకచక్యంగా గంజాయిని పట్టుకున్న ఎస్ఐలను,సిబ్బందిని అభినందించారు.

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

23 Mar 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```